రామ్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా?



ఇస్మార్ట్ శంకర్  సినిమా  తో  హిట్ అందుకున్న  రామ్ ,  ఆ తరువాత   కిశోర్ తిరుమల  డైరేక్షన్  లో   మూవీ  ఎనౌన్స్ చేసాడు  .  రామ్ , కిషోర్ తిరుమల కాంబినేషన్ లో  వచ్చిన  రెండు  సినిమాలు  మూజికల్ గా   హిట్ అయినాయి అంటే  దానికి  కారణం  దేవిశ్రీప్రసాద్ .
 పూరి  -రామ్ కలయుక లో  వచ్చిన  ఇస్మార్ట్ శంకర్  సినిమాకు సంగీతం  అందిచాడు   మణిశర్మ , ఈ సినిమా లో  పాటలకు ప్రేక్షకులు  బాగా కనక్ట్ అయ్యారు , అందుకనే  మల్లి  రామ్  మణిశర్మ కు  అవకాశం ఇచ్చాడు  అని ఫిల్మ్ నగర లో వార్తలు  వినిపిస్తున్నాయి.   

యువ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ఒక ఫుల్ మాస్ స్టయిల్ లో  తో సాలీడ్ హిట్ అందుకున్నాడు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా  రామ్  కెరీర్ లో  బెస్ట్ సినిమా  . గత కొన్నేళ్లుగా మంచి మ్యూజిక్ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ  మణిశర్మ  వర్క్ చేసిన ఎ  సినిమాలు  కూడ  సక్సెస్ కావడం లేదు, దీంతో తన కసి మొత్తాన్ని ఇస్మార్ట్ శంకర్ తో బయటపెట్టాడు.  దాదాపు అన్ని పాటలు బెస్ట్ హిట్స్ అయి  ప్రేక్షకులను   అలరించినాయి  .

యూట్యూబ్ లో మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయ్ ,ఇస్మార్ట్  శంకర్ సినిమా  సాంగ్స్   .అసలైతే దర్శకుడు కిషోర్ తిరుమల తాను  చేసిన మొదటి మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ నే  తీసుకున్నాడు  , కాని రామ్  కిశోర్ తిరుమల కు  మణిశర్మ ను సజెస్ట్  చేసాడు,  అందుకనే  రామ్ మాటను  కాదనలేక పోయాడు . కిషోర్  తిరుమల  సినిమాకు   మొదటి సారిగా మణిశర్మ  పనిచేస్తున్నాడు  ,  కాబట్టి  సంగీతం   ప్రేక్షకులను  ఎంత  మేరకు  ఆకట్టుకుంటుందో  తెలియాలంటే  సినిమా రిలీజ్  అయ్యేదాకా ఆగాల్సిందే .